తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ.. ముఖ్యనేత సైఫుల్లా హతం

  • హక్కానీ నెట్‌వర్క్ దాడిలో సైఫుల్లా సహా ముగ్గురి హతం
  • కరాచీలో బస్సుపై దాడిచేసి 45 మందిని పొట్టనపెట్టుకున్న సైఫుల్లా
  • 2016లో అరెస్ట్ చేసిన అమెరికా.. 14 నెలల తర్వాత విడుదల
ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ తాలిబన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక వేర్పాటువాద గ్రూపు హక్కానీ నెట్‌వర్క్ జరిపిన దాడిలో కరుడుగట్టిన తాలిబన్ కమాండర్, తెహ్రిక్-ఇ-తాలిబన్-పాకిస్థాన్ (టీటీపీ) నేత క్వారీ సైఫుల్లా మెహసూద్ హతమయ్యాడు. ఖోస్త్ ప్రావిన్స్‌లోని గులూన్ స్థావరం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో సైఫుల్లాతోపాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కరుడుగట్టిన ఉగ్రవాది అయిన సైఫుల్లాను 2016లో ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 14 నెలల అనంతరం విడుదలయ్యాడు. అంతకుముందు 2015లో కరాచీలో బస్సుపై దాడి చేసి 45 మంది ప్రాణాలు తీశాడు. ఈ ఏడాది ఖైబర్ పంక్తుంఖ్వాలోని ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలో ఏకంగా 75 దాడులకు పాల్పడినట్టు సైపుల్లా స్వయంగా వెల్లడించాడు. అతడి మృతి టీటీపీకి పెద్ద ఎదురుదెబ్బేనని అంటున్నారు.
Go Back to Shorts
Taliban commander
Qari Saifullah Mehsud
Afghanistan

More Telugu News